Posted on 2024-02-25 17:55:33
డైలీ భారత్, రాజన్నసిరిసిల్ల జిల్లా: పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది.
అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందు కోవడమే గాక, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు కూడా సంపాదించింది ఆ చిన్నారి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వేముల సాగర్-సౌమ్య ల కూతురు సంవేద్యకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.
అమ్మానాన్నలను గుర్తించడమే కష్టమైన వయసులో 70కి పైగా కేటగిరీలలో వస్తువులను గుర్తించడం ద్వారా సంవేద్య తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను ఆకట్టుకుంది.
చిన్నారి ప్రతిభకు అబ్బుర పడిన ప్రతినిధులు బంగారు పతకంతో సన్మానించడమే కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేశారు. పాప రంగులను గుర్తించడం చూసి వివిధ రకాల కేటగిరీలో వస్తువు లను చూపించడం ద్వారా వాటిని గుర్తించేలా ప్రాక్టీస్ చేయించామని తల్లిదండ్రులు తెలిపారు.
తమ చిన్నారి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >