Posted on 2024-02-25 17:56:49
డైలీ భారత్, హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు రోజుల క్రితం ORRపై పటాన్ చెరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఆ రోజు అందుబాటులో లేని కేటీఆర్.. ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు.
లాస్య రోడ్డు ప్రమాదం లో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యానని, ఆరోజు నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ అమ్మాయిని గత 10,15 రోజులుగా అనేక ప్రమాదా లు వెంటాడాయని, గత ఏడాది వారి నాన్న ఎమ్మె ల్యే సాయన్న చనిపోయా రని, ఇప్పుడు ఈమె చనిపో వటం బాధాకరమని కేటీఆర్ అన్నారు.
లాస్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా మని, లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించారని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ వెంట మాజీ హోమ్ మంత్రి, ఎమ్మెల్సీ మహ మూద్ అలీ, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
కేటీఆర్ రాక నేపథ్యంలో కంటోన్మెంట్ కు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భారీగా చేరుకున్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >