| Daily భారత్
Logo




సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

News

Posted on 2026-07-21 15:22:53

Share: Share


సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డు అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించిన ఆమె, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక సంఘం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో ఈ సమస్యను ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్ రావు ప్రత్యేక నిధుల నుంచి రూ.6 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పట్లో పనులు చేపట్టలేకపోయామని, ప్రస్తుతం రోడ్డు పొడవు పెరగడంతో అదనపు వ్యయం అవసరమైందని చెప్పారు. అందువల్ల మున్సిపల్ జనరల్ నిధుల నుంచి మరో రూ.3 లక్షలు కేటాయించి, మొత్తం రూ.9 లక్షల వ్యయంతో రహదారిని పూర్తిస్థాయిలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వార్డుల్లో రోడ్లు, మురుగు కాలువలు వంటి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధే తమ పాలన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖాదిర్ పాషా, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్, డి.ఈ. వాణి, ఏ.ఈ. నరసింహస్వామి, వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


#RajannaSircilla #Sircilla #Municipality #CCRoad

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >