Posted on 2026-07-19 04:48:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు పరిధిలో గోపీకృష్ణ నర్సరీ ఎదుట, కొత్తగూడెం–ఖమ్మం బి.టి. రోడ్డుపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో OD 10 H 4342 నంబరు గల మహీంద్రా జైలో (Mahindra XYLO) వాహనాన్ని పరిశీలించగా, అందులో ప్రయాణిస్తున్న వికాస్ మండల్ (46), త్రినాథ్ బిసోయి మరియు గణేష్ ముదులి (21) అనే ముగ్గురు వ్యక్తుల వద్ద 100 గ్రాముల చొప్పున మూడు (03) ప్యాకెట్ల డ్రై గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,000 అంచనా నిందితుల వద్ద నుండి డ్రై గంజాయిని పంచసాక్షుల సమక్షంలో చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని సీజ్ పంచనామా నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం (NDPS Act) సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జూలూరుపాడు పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలునిర్వహిస్తున్నారని, ప్రజలు మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి పోలీసులకు సహకరించాలని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >