Posted on 2026-06-14 13:07:39
డైలీ భారత్, స్పెషల్:
తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం...
గోవిందా గోవిందా నినాదాల గగనంలో
గిరులు కూడా తలవంచిన ఆ మహా సన్నిధిలో
శ్రీవారి కృపా కటాక్షం తాకిన వేళ...
జీవితమే కొత్త వెలుగుల దీపమై మారెను…!
మంజుల కలం నుంచి జారిన ప్రతి అక్షరం
పూల మాలలా మారి పాదాల వద్ద చేరెను
అవి భక్తి గీతాలై లోకమంతా విరిసెను
హృదయాలను తాకే అమృత ధారలై ప్రవహించెను..!
శ్రీనివాసా… నీ నామం పలికిన చోట
మాటలు మౌనమై ప్రార్థనగా మారిపోతాయి
దుఃఖం కూడా దారిచూపే దీపమవుతుంది
మనసు తననే తాను మరిచిపోయే క్షణమవుతుంది..!
అక్కడ వెలిగే దీపం నూనెతో కాదు
మనిషి లోపల కరిగే అహంతో వెలుగుతుంది..!
మంజుల కలం నుంచి వచ్చిన అక్షరాలు
అది అక్షరాలుగా కాదు—ఆర్తిగా ప్రవహిస్తుంది
ప్రతి పదం ఒక పుష్పమై పాదాల వద్ద వాలుతుంది
ప్రతి వాక్యం ఒక నిశ్శబ్ద ప్రదక్షిణగా తిరుగుతుంది..!
తిరుమల శిఖర సింహాసనంపై విరాజిల్లే స్వామీ
నీ పాదస్పర్శ లభిస్తే మా జన్మ ధన్యమవుతుంది..!
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >