Posted on 2026-03-12 21:54:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఎల్పిజి డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.అయితే, ఈ నిబంధన కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. నగరాల్లో పాత నిబంధనే (25 రోజులు) కొనసాగుతుందని స్పష్టం చేసింది. కొరత సాకుతో కమర్షియల్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలో అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పనిచేస్తున్నాయని పేర్కొంది. సరిపడా నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డిజీల్ను సరఫరా చేస్తున్నామని వాహనాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >