Posted on 2026-03-10 17:32:22
డైలీ భారత్, కామారెడ్డి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు
అటవీ శాఖలో నిర్వహించే అన్ని కార్యకలాపాలను అటవీ అధికారులు కలెక్టర్ కి ప్రదర్శించగా, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే స్థానిక వృక్ష జాతులు, అడవి జంతువుల పాదముద్రలు (పగ్ మార్క్స్), మల అవశేషాలు (స్కాట్స్) , ఇతర గుర్తులను వివరించారు. అదేవిధంగా అటవీ శాఖలోని కార్యకలాపాల ఫోటోలు ప్రదర్శించి, అటవీ అగ్నిప్రమాదాలను నియంత్రించడానికి ఉపయోగించే ఫైర్ ఎక్విప్మెంట్ , అగ్నిప్రమాదాల నియంత్రణ విధానాలను వివరించారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అడివి సంరక్షణ, భద్రతకు అటవీ అధికారులు, ప్రజా భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా అటవీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత లాభాలు చేకూరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >