Posted on 2026-02-20 09:56:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణరాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన కొనసాగుతోందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా విమర్శించారు.మాజీ ప్రభుత్వ విప్ చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని ఆయన ఘాటుగా ఖండించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు లేక అడ్డదారుల్లో గెలవాలనే కుట్ర బుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మంత్రి వివేక్ అక్రమాలకు అడ్డుపడ్డ బాల్క సుమన్ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురి చేయడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమేనని మండిపడ్డారు.ఇలాంటి దమనకాండకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెన్నూరు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.వివేక్ ఎన్ని కుట్రలు చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.అక్రమంగా అరెస్టు చేసిన బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >