Posted on 2026-02-07 13:09:46
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి
14వ వార్డులో ఇంటింటి ప్రచారం
భారీ ఎత్తున తరలివచ్చిన యువ నాయకులు..
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిరంతరం ప్రజల మధ్యనే ఉండి సేవలు అందించే యువనేత అందెమోహన్ కు మీరు వేసే ఓటు వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 14 వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. వార్డులో ఇలాంటి సమస్య ఉన్న ఎమ్మెల్యే వీడ్లపల్లి శంకర్ సహకారంతో అందెమోహన్ పరిష్కరిస్తారని, ఎప్పటికీ అందుబాటులో ఉంటాడని తెలిపారు. అందమోహన్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, షాద్ నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు పులిమామిడి రాజేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శి నరేందర్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు నిడదవెల్లి ఆమేన్, గుండాల అనిల్, నందిగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటాచారి, కొత్తూరు మండల అధ్యక్షుడు శివ గౌడ్, చౌదరిగుడా మండల అధ్యక్షుడు కుమార్, నందిగామ మండల ఉపాధ్యక్షుడు హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రదీప్, ఇసాక్,రాజేష్ రాహుల్, వంశీ, ఫిరోజ్, సచిన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >