Posted on 2026-02-05 03:33:27
డైలీ భారత్, హైదరాబాద్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గద్దర్ ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అన్ని భాషల సినీ పరిశ్రమలు హైదరాబాద్కు వస్తే యువతకు, టెక్నీషియన్లు, రచయితలు, దర్శకులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని పేర్కొంటూ, ఆయన పేరుతో సినిమా అవార్డులు ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధాన ప్రమాణమని స్పష్టం చేశారు.
ఈ నెల 6 నుంచి అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న ఉగాది పండుగ రోజున గద్దర్ ఫిలిం అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >