Posted on 2026-01-12 07:58:11
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో (ఐవిఎఫ్) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాల్లో కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు,ఎన్జీవోలు మరియు వ్యక్తులకు జాతీయ పురస్కారాలను,2025వ సంవత్సరంలో మూడుసార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు ఉత్తమ రక్తదాత పురస్కారాలను సోమవారం రోజున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో నిర్వహించడం జరుగుతుందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్ లు తెలియజేయడం జరిగింది.ఇట్టి జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన మోతె రాజిరెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో 79 మందికి ఈ యొక్క పురస్కారాలను అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అవార్డు గ్రహీతలు రావడం జరుగుతుందని,ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అవార్డుకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేశారు మరింత సామాజిక సేవా బాధ్యతను పెంపొందించాలని ఉద్దేశంతోనే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >