Posted on 2026-01-08 15:13:17
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నాలుగు మండలాలకు చెందిన 214 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో పేదలకు తోడుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాళా తీసిందని విమర్శించారు.
వృద్ధులకు త్వరలోనే పెన్షన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని గుర్తు చేశారు. బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, రైతు భీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాల ద్వారా పేదలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తివంతతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమేనన్నారు.
ఇందిరామహిళా శక్తి కింద డ్వాక్రా గ్రూపులు సిండికేట్గా ఏర్పడి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తే నెలకు రూ.70,000 ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు వివరించారు. రైతును రాజును చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఉచిత కరెంట్, రైతుభరోసా, రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయన్నారు.
హైదరాబాద్ను గ్లోబల్ సిటిగా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేకపోవడం ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్లో ఆస్తుల పంచాయతీ నడుస్తోందని, కుటుంబ విభేదాలు బయటపడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >