Posted on 2026-01-08 06:23:49
డైలీ భారత్, హుజూర్ నగర్: వేగంగా గమ్యం చేరాలని ఆరాటం కన్నా ప్రాణం విలువని తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల భవితవ్యాన్ని గుర్తు పెట్టు కోవాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా స్థానిక పాత బస్టాండ్ లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల అమలులోకి వచ్చిన నూతన చట్టాలలో రోడ్డు ప్రమాద కారకులకు కఠిన శిక్షలు నిర్దేశించబడ్డాయని రోడ్డు యాక్సిడెంట్ కేసులో ముద్దాయిగా ఉంటే ఆ కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని ఆమె తెలిపారు. వాహనాలు నడుపు తున్నప్పుడు మద్యం సేవించడం కానీ, హెల్మెట్ ధరించకపోవడం గానీ, సీటు బెల్టు పెట్టుకోకపోవడం గానీ, రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించకపోవడం గానీ శిక్షారమని అటువంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణికులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరుల చేత రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్ రాఘవరావు, నాగేష్ రాథోడ్, ఉదారి యాదగిరి,శంకర్ నాయక్, పెండెం సాయిరాం గౌడ్, నాగరాజు నాయక్, రామారావు, ఏఎస్ఐ బలరాం రెడ్డి, న్యాయశాఖ సిబ్బంది అనిత, సుశీల,పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >