| Daily భారత్
Logo




సిరిసిల్ల పట్టణ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం – ఉల్లంఘించిన వారికి జరిమానాలు

News

Posted on 2026-01-07 13:30:29

Share: Share


సిరిసిల్ల పట్టణ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం – ఉల్లంఘించిన వారికి జరిమానాలు

డైలీ భారత్, సిరిసిల్ల:స్వచ్ఛ సర్వేక్షన్ 2025 లో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టే దిశగా వివిధ వాణిజ్య వ్యాపార ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించబడినవి.

ఈ సందర్భంగా వ్యాపార వర్గాలు, దుకాణదారులకు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను వివరించారు. పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సిరిసిల్లను శుభ్రంగా నిలుపుకోవడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించి, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వంటి పర్యావరణహిత పదార్థాలను వినియోగించాలని మున్సిపాలిటీ అధికారులు వ్యాపారులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


#sircilla #rajanna sircilla 

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >