Posted on 2026-01-07 18:00:29
డైలీ భారత్, సిరిసిల్ల:స్వచ్ఛ సర్వేక్షన్ 2025 లో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టే దిశగా వివిధ వాణిజ్య వ్యాపార ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించబడినవి.
ఈ సందర్భంగా వ్యాపార వర్గాలు, దుకాణదారులకు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను వివరించారు. పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిరిసిల్లను శుభ్రంగా నిలుపుకోవడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నివారించి, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వంటి పర్యావరణహిత పదార్థాలను వినియోగించాలని మున్సిపాలిటీ అధికారులు వ్యాపారులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#sircilla #rajanna sircilla
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >