Posted on 2026-01-05 16:19:41
రూ.2,50,000 బాండ్ అందించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం ద్వారా మంజూరైన కులాంతర వివాహ ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన జక్కుల ప్రియాంక కులాంతర వివాహం చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహక కోసం ఎస్సీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకు న్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి మంజూరు అయిన రూ. 2,50,000 విలువైన ఫిక్స్డ్ బాండ్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో సోమవారం జక్కుల ప్రియాంక కు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. జిల్లాలో ఇప్పటిదాకా 180 దరఖాస్తులు రాగా, 57 మందికి రూ.1 కోటి 42 లక్షల 60 వేలు పంపిణీ చేశా మని, మరో 11 మందికి త్వరలో నే ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్లను పంపిణీ చేస్తామని, మిగతా వారికి ఎస్సీ కమిషన ర్ నుంచి మంజూరు అయిన తర్వాత ఇస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >