Posted on 2025-12-24 23:21:57
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి మరియు గ్రామ మాజీ సర్పంచ్ స్వర్ణలత సతీష్ కుమార్ బిఆర్ఎస్ గ్రామం యూత్ ప్రెసిడెంట్ కావాలి రమేష్ ముదిరాజ్ తో సహా గ్రామ నాయకులు 100 మంది బిఆర్ఎస్ కార్యకర్తలను చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామెన భీమ్ భారత్,రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహ రెడ్డితో పాటు ఆయన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వారు అన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. పార్టీలోకి వస్తున్న నాయకులు ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ పార్టీ ప్రభుత్వ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు ,గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్మలి మానయ్య మాణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశ్వక్ అలీ, రామ్ రెడ్డి, మల్లారెడ్డి, హైతాబాద్ సర్పంచ్ కర్రే శాంతమ్మ యాదయ్య ,అంతారం సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంజీవరెడ్డి,శ్రీరామ్ రెడ్డి, నాయకులు మద్దూరి మల్లేష్,సుభాష్ రెడ్డి ,కిషోర్,భార్గవ్ రామ్, పెంటారెడ్డి, బాలకృష్ణారెడ్డి, జహంగీర్ వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, నూతన ఉపసర్పంచులు, వార్డు సభ్యులు మరియు రుద్రారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >