Posted on 2025-10-16 22:15:17
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట:బిసిలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగంలో అమలు పరచాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షలు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ గురువారం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్య ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో బిసిలకు రిజర్వేషన్ లు పెంచాలని గత కొంత కాలంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ లు కల్పించాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకుండా 9వ షెడ్యూల్ లో చేర్చక పోవడంవల్ల బిసి లకు రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి రాంచేందర్, షేక్ జావీద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >