Posted on 2023-12-25 14:27:19
అధికారులకు తెలియకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయా.?
పెద్ద తలల అండదండలతో బినామీల పేర్లతో భూముల కొనుగోలు..?
దళారులు తక్కువ ధరలకు భూములను అమ్మడం తొ కొనుగోలు చేసి మోసపోయిన గిరిజనులు, పేద కుటుంబాలు...?
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత మానుకోట భూముల ధరలు అమాంతం పెరిగి పోవడంతో కొందరు పెద్ద తలకాయల కన్ను ప్రధాన రహదారి చేరువలో ఉన్న ప్రభుత్వ భూముల పైన పడి , వారి (బినామీలు) నమ్మిన బంటులు కొంత ఆక్రమణ ద్వారా , మరికొంత చేతులు మారుస్తూ అమ్మకం చేసిన భూ దళారులు, మున్సిపాలిటీ నిర్మాణం పర్మిషన్స్ లేకుండానే, తప్పుడు పత్రాలతో ఇల్లు లేకుండా , ఇంటి నెంబర్ ను సృష్టించి ఇష్టాను సారంగా కొందరి పెద్ద తలకాయల అండతో,(గిరిజనులు) నిరుపేదలకు అమ్మకం చూపగా కొనుగోలు చేసి నిర్మాణం కొరకు అమ్మిన వారిని సంప్రదించగా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు , కౌన్సిలర్ల సహకారం తో, అధికారుల కళ్ళు కప్పుతూ నెమ్మదిగా నిర్మాణాలు జరుగు తుండడం గమనార్హం , తెలిసీ, తెలియక తక్కువ ధరలకు సొంతింటి కల నెరవేరుతుందని భూములను కొనుగోలు చేసిన యజమానులకు ప్రభుత్వం కొన్ని జీవో ల ద్వారా రెగ్యులేషన్ కొరకు, ప్రభుత్వానికి కొంత ధనాన్ని చెల్లించలని జీవో తీసుకురాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జీవో ద్వారా ప్రభుత్వానికి డబ్బు చెల్లించడం కూడా జరిగింది. అయినను ప్రభుత్వం అవసరం నిమిత్తం జీవో ద్వారా డబ్బు చెల్లించిన వారి భూమిని సైతం అవసరాలకు తగినట్లుగా, నిర్మాణాలను ఉక్కుపాదంతో నేలమట్టం చేసి ప్రభుత్వ భూములను లాక్కోవడం జరిగింది. (ఉదాహరణకు) రైతు వేదిక, ప్రభుత్వ కాలేజ్, సఖి కేంద్రం వంటి అవసరాల కొరకు ప్రభుత్వ భూమీనీ తీసుకోవడం జరిగింది.
స్థానిక ప్రజలు తెలిసి తెలియక మేము భూములను కొనుక్కొని ప్రభుత్వం చెప్పిన జీవోల ద్వారా డబ్బులు చెల్లించిన మా భూములను లాక్కోవడం బాధాకరమని , కొందరు పెద్ద తలకాయలు అండ దండలతో మహబూబాబాద్ లో ఉన్న భూములను మాత్రం స్వేచ్ఛగా ఇష్టానుసారంగా నచ్చిన విధముగా నిర్మాణాలు జరుపుతున్న, ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా ఉడడం పెద్ద తలలకు సహకరిస్తు న్నారని , నిర్మాణాలు జరిపి నష్టపోయిన ప్రజలంతా ఆవేదన వ్యక్తపరుస్తు, ప్రభుత్వ అవసరం నిమిత్తం తీసుకున్న భూమిని, కోల్పోయిన నిరు పేదల మైన మాకు కుటుంబం తో తల దాచు కోవడానికి ఇంటి నిర్మాణం కొరకు కనీసం 80 గజముల (స్థలం) ఇచ్చి ఆదుకొని తగిన న్యాయం చేయవలసినది గా ప్రభుత్వాన్ని , అధికారులను ప్రజా ప్రతినిధులకు గతంలో ఎన్ని సార్లు విన్నవించు కున్న పట్టించు కొక పోవడం బాధా కరమణి ఆవేదన వ్యక్త పరుస్తూ, దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల అందరికి ఇంటి స్థలాన్ని లేదా డబల్ బెడ్ రూమ్ ఇచ్చి న్యాయం చేకూర్చలని కోరుతున్న ప్రజలు.....?
జర్నలిస్ట్, ఇండ్ల మహేష్
9885942502
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >