Posted on 2023-12-25 12:40:24
డైలీ భారత్, నాగర్కర్నూల్:నాగర్ కర్నూల్ పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎలుక కారణంగా 40 రోజుల పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
పట్టణంలోని నాగనూల్ ప్రాంతంలో నివసించే శివ, లక్ష్మికళ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. శనివారం డిసెంబర్ 23 ఆర్డ రాత్రి నేలపై తల్లితో నిద్రిస్తున్న చిన్నారి ముక్కును ఎలుక కొరకింది. ఇది తల్లిదండ్రులు గమనించకపోవటంతో తీవ్ర రక్తస్రావమైంది.
శిశువు ఏడుపుతో నిద్రలేచిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే పట్టణ ఆసుపత్రికి తరలించారు. తరువాత పరిస్థితి విషమంగా ఉండటంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం సాయంత్రం చిన్నారి మృతి చెందింది దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం అక్కడున్నవారిచే కంటతడి పెట్టించింది.
ఎలుకల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. చిన్నారులు ఉన్న చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలుకలు, విషపురుగుల బారిన చిన్నారులు పడ కుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు....
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >