| Daily భారత్
Logo




ప్రాణాలకు తెగించి ఫ్యామిలీ ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

News

Posted on 2023-12-22 06:16:41

Share: Share


ప్రాణాలకు తెగించి ఫ్యామిలీ ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

డైలీ భారత్, హైదరాబాద్:ఎర్రమంజిల్ సమీపంలో ఓ వాణిజ్య భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంతో అందులో నివసిస్తున్న కొంత మంది తప్పించుకుని బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేశారు.

లోపలి చిక్కుకున్న పలువుర్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్.. పెను సాహసమే చేశారు. తన ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని మంటల నుంచి కాపాడారు.

ప్రమాదం జరిగి అరగంట దాటిపోయిన ఫైర్ ఫైరింజన్ చేరుకోకపోవడంతో మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శ్రావణ్ ధైర్యం చేశాడు. లోపలికి ప్రవేశించి చాకచాక్యంగా ఓ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు.

దీంతో కానిస్టేబుల్‌ను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభినదించారు. పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసులు దశరథ రామ్ రెడ్డి, సత్యనారాయణ అనే కానిస్టేబుల్లు సైతం శ్రమించి బాధితులను రెస్కు చేశారు..డంబెళ్ల సాయంతో కిటికీలను పగలగొట్టి వారిని బయటికి తెచ్చారు.

కాగా, ప్రమాదానికి షాక్ సర్కిట్ కారణమా లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అవడం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని, తదుపరి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

మెయిన్ రోడ్డుకు సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >