| Daily భారత్
Logo




వరుస హత్యల ఘటన: ఐదుగురు నిందితుల అరెస్టు

News

Posted on 2023-12-19 18:24:02

Share: Share


వరుస హత్యల ఘటన: ఐదుగురు నిందితుల అరెస్టు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు, రూ.30 వేల నగదు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదాశివనగర్ పీఎస్లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.నవంబర్ 29న మాక్లూర్ మండలంలో ప్రసాద్ హత్యకు గురయ్యాడు. మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్, వంశీ, విష్ణు అనే ముగ్గురు కలిసి ప్రసాద్ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ప్రసాద్ జైలులో ఉన్నాడని ఆయన్ని కలుద్దామని చెప్పిఈ నెల 1న ఆయనభార్యశాన్వికనుప్రశాంత్, నిజామాబాద్ తీసుకెళ్లాడు.బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుతో కలిసి ఆమెను చంపేసి గోదావరిలో పడేశారు. అదే రోజున ప్రసాద్ చెల్లి శ్రావణిని సైతం తీసుకెళ్లారు. మెదక్ జిల్లా వడియారం వద్ద ఆమెను చంపి తగులబెట్టారు.ప్రసాద్ వద్దకు వెళ్లామని చెప్పి ఆయన తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్ తీసుకెళ్లాడు. వారిని నిజామాబాద్ లాడ్జిలో ఉంచారు. డిసెంబర్ 4న తమ్ముడితో కలిసి పిల్లల్ని ప్రశాంత్ చంపేసి మెండోర వద్ద సోన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్ 13న మరో చెల్లి స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు. కుటుంబ సభ్యులు రాకపోవడంతో ప్రసాద్ తల్లి సుశీల లాడ్జి నుంచి పారిపోయింది” అని సింధు శర్మవివరించారు. ఆమె కోసం వచ్చినముగ్గురిని అరెస్టు చేసినట్లుచెప్పారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద  ప్రశాంత్ మరో ఇద్దరునిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్ కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రశాంత్ వద్దలభించాయని ఇప్పటి వరకు 4మృతదేహాలు లభించగా, ప్రసాద్ ఆయన భార్య మృతదేహాలు లభ్యంకాలేదని ఎస్పీ తెలిపారు

Image 1

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

Posted On 2026-06-07 13:06:00

Readmore >
Image 1

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-07 13:04:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >