Posted on 2025-07-09 21:30:33
జిల్లాలో ఎక్కడో ఓ చోట తరచుగా ఇలాంటి ఘటనలు చేసుకుంటున్న వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక పోలీస్ స్టేషన్ లో యువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలో నాగారం ప్రాంతానికి చెందిన మహ్మద్ జీషాన్ ను స్థానిక అరవ టౌన్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న కేసులో సారంగపూర్ లో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రిమాండ్ కు తరలించేందుకు సిద్ధం అవుతుంటే పోలీస్ స్టేషన్ లోని బాత్ రూంలో ఉన్న ఫినాయిల్ తాగడంతో అతడిని ఎల్లమ్మ గుట్టలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేయించి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది. జీషాన్ ను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారణ రిమాండ్ వ్యవహారంలో వేధింపులు కారణమని బాధితుడి తండ్రి అయూబ్ ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మార్చి 115 మరువకముందే చనిపోయిన మరో విషయం యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గత కొన్ని నెలల కిందట రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలో నే ఇలాంటి ఘటనే ఓ యువకుడు లాకప్ లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడడం గమనార్హం.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >