Posted on 2025-07-09 18:12:16
బైక్ పై వస్తుండగా కుక్క రావడంతో తప్పించబోతుండగా దారుణం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దైవదర్శనం కోసం బాసర అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా నగరంలోని కంటేశ్వర హౌసింగ్ బోర్డ్ వద్ద కుక్కను తప్పించబోయి బైక్ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో వీరి ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు వచ్చింది. దీంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో బైక్ పై వెనకాల కూర్చున్న భవాని కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా నిర్ధారించారు. అయితే వారం రోజుల్లో కుమారుడు విదేశాలకు వెళుతున్నాడని సంతోషంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఇంటలిజెన్స్ ఏఎస్ఐ భీమారావు కన్నీరు మునీరుగా విలపించారు. అయితే వీరు స్థానికంగా గంగా స్థాన్ 1 లోని విష్ణు ప్రియ రెసిడెన్సి లో నివాసం ఉంటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇంట్లోకి అడుగుపెట్టే క్రమంలో కుక్క రూపంలో భవాని అనంతలోకాలకు వెళ్ళిపోయింది. భవాని అపార్ట్మెంట్లో ఎవరికి ఎలాంటి ఆపద ఎదురైనా ముందుండి వారికి ధైర్యం చెబుతూ అండగా నిలిచేవారని ఇప్పుడు ఆమె ఆకస్మిక మరణం తమను తీవ్రంగా కలిసి వేస్తుందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఏఎస్ఐ ఐ సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఏఎస్ఐ తోటి సిబ్బంది తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి పద్దకు చేరుకున్నారు. కాగా ప్రమాద ఘటన పై పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >