| Daily భారత్
Logo




“భార్యాభర్తల వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్”

News

Posted on 2025-07-09 12:20:51

Share: Share


“భార్యాభర్తల వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్”

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బి. వై. నగర్‌లోని కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ రోజు మనో వికాస సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్  పాల్గొని, కుటుంబ సమస్యల పరిష్కారం గురించి విలువైన అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ –

‘‘ఈ కాలంలో భార్యాభర్తల మధ్య వివాదాలకు ప్రధాన కారణం పరస్పర అర్థం చేసుకోలేకపోవడమే అని అన్నారు.

ప్రతి వ్యక్తి యొక్క భావాలు, ఆలోచనలు, అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని తెలుపుతూ అవి గమనించి గౌరవించే దిశగా ప్రయత్నించకపోతే కుటుంబంలో కలహాలు వస్తాయని అన్నారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అన్నారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ వల్ల లాభాలను గురించి పున్నంచందర్ వివరిస్తూ

పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుందనీ తెలుపుతూ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే విధానాన్ని నేర్చుకుంటారని అన్నారు.

సందేహాలు, అపోహలు తొలగి నిజమైన భావాలను వ్యక్తీకరించే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

ఓర్పు,  సహనశీలత పెరిగి కోప పడకుండా సానుకూలంగా స్పందించే నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తీవ్రమైన వివాదాలు తగ్గి , చిన్న విషయాలను పెద్దగా చేసుకోకుండా సమస్యలను నిర్మాణాత్మకంగా చర్చించటం అలవడుతుందని తెలిపారు.

ఆత్మవిశ్వాసం పెరిగి , వ్యక్తిగత సమస్యల్ని కూడా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అన్నారు.

సంబంధాలు బలపడడం వల్ల విడాకుల దశ వరకు వెళ్లే అవకాశం ఉండదని అన్నారు.

అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గి, మనశ్శాంతి పెరుగుతుంది తెలిపారు.

"సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవడం, మాట్లాడుకోవడం, పరిష్కారం వెతకడం చాలా అవసరం అని తెలిపారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక దిశానిర్దేశం మాత్రమే కాదు, అది కుటుంబ జీవితం పునరుత్తేజం పొందే ఒక సానుకూల మార్గం." అని వివరించారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం మైండ్ కేర్ సెంటర్ లో తమను సంప్రదించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో  మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ పలువురు మహిళలు, కార్మికులు పాల్గొన్నారు.

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >