Posted on 2025-07-08 21:08:48
హామీ ఇచ్చిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాంప్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం నాడు డియుడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆధార్ ఈడీఎం సైదేశ్ కు ఆదేశాలు ఇచ్చారు అదనపు కలెక్టర్. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఈ మెగా క్యాంపు అనంతరం త్వరలోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసి తేదీలు తెలియజేస్తామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సామాన్య ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఈ మెగా ఆధార్ సవరణల కేంద్రంలో ఇబ్బంది పడకుండా జర్నలిస్టులందరి కోసం ఏర్పాటు చేసే తేదీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతిష్టాత్మక దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన ఆధార్ సవరణల మెగా క్యాంప్ జూలై 9 10 వ తేదీలలో జిల్లాలోని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఉదయ్ కుమార్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ పాల్గొన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >