Posted on 2025-07-05 12:18:44
అదృష్టం వరించింది - మహిళా కూలీకి దొరికిన 15 క్యారెట్ల వజ్రం
కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వేట - ఓ మహిళకు దొరికిన వజ్రం - అమ్మితే లక్షలే
డైలీ భారత్, కర్నూల్: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వాలిపోతుంటారు. ఏదైనా జాతర గానీ ప్రత్యేకమైన పండుగ గానీ ఉందనుకుంటే తప్పే. అక్కడ వజ్రాల వేట జోరుగా సాగుతుంది. వాన పడిందంటే వేట మొదలు పెడతారు. తొలకరి చినుకులు పలుకరిస్తే చాలు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు.
రంగు రాళ్లు అరచేతిలో మెరిసి తమ రాతను మారుస్తాయని ఆశపడతారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా దూరప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తుగ్గలి మండలం పెండేగల్లు గ్రామంలో 15 క్యారెట్ల బరువైన వజ్రం లభ్యమైంది. మహిళా కూలీ పొలం పనులు చేస్తుండగా ఈ వజ్రం దొరికింది. దీనికి సంబంధించి బేరం కుదరకపోవడంతో ఇంకా కొనుగోలు కాలేదని సమాచారం.
లక్షాధికారులను చేసిన వజ్రం: ఈ క్రమంలోనే మే నెలలో పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయం వద్ద ఉంటున్న ఓ వ్యక్తికి రూ.30 లక్షల
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >