Posted on 2025-07-03 14:37:52
వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న హజరత్ బాబా సమాధిని తొలగించాలి : రాజన్న భక్తుడు మారవేని రంజిత్ కుమార్ డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గల హజరత్ బాబా సమాధిని తొలగించాలని మారవేని రంజిత్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి రెజిస్టర్డ్ పోస్టు ద్వారా వినతిపత్రం పంపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
"పవిత్ర శివలింగంపై మూత్ర విసర్జన చేసిన హజరత్ బాబా సమాధిని దేవాలయ ప్రాంగణంలో ఉంచడం హిందూ ధర్మాన్ని కించపరచే చర్య. ఇది ఆలయ పవిత్రతకు మంగళంకరం" అని అన్నారు.
ఇలాంటి వ్యక్తి సమాధి చుట్టూ మజార్ ధోరణిలో ప్రార్థనలు, మతపరమైన నినాదాలు జరుగుతుండటం ఆలయ ఆగమ నియమాలకు విరుద్ధమని, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. దేవాలయ ప్రాంగణంలో అప్రామాణిక నిర్మాణాలు మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే, "ఖురాన్ ప్రకారమే అల్లా ఒక్కడే దేవుడని చెప్పబడిన తరుణంలో, ముస్లింలే ఇటువంటి మజార్ నిర్మాణాలను సమర్థించలేరు. కనుక మతాల మధ్య బాహ్య ఉద్రేకాలకు తావివ్వకుండా, మతాల గౌరవాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి" అని రంజిత్ కుమార్ కోరారు.
అలాగే, ఆలయ పరిసరాల్లో ఉన్న ఈ సమాధిని ఇతర అనుకూల ప్రదేశానికి తరలించి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ని కోరారు.
ఇది హిందూ భక్తుల మనోభావాలకు గౌరవం కల్పించడమే కాక, మతసామరస్యాన్ని పరిరక్షించే చర్య కూడా అవుతుందిని ఆయన స్పష్టం చేశారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >