| Daily భారత్
Logo




బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100 కు సమాచారం అందించండి :ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

News

Posted on 2025-06-30 19:40:57

Share: Share


బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100 కు సమాచారం అందించండి :ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100 కు సమాచారం అందించండి.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు.

జిల్లా ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

డైలీ భారత్, మహబూబాబాద్: జూలై 1 నుండి 31వ తారీఖు వరకు వరకు నిర్వహించే ఆపరేషన్ ముష్కాన్ -XI లో భాగంగా ఆపరేషన్ ముష్కాన్ పోస్టర్స్ ను విడుదల చేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు.

జిల్లాలోని రెండు సబ్ డివిజన్లయిన మహబూబాబాద్, తొర్రుర్ సబ్ డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి, జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం కృషి  జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ ముష్కాన్ XI కి సంబందించిన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశ నిర్వహణతో పాటు,వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆపరేషన్ ముష్కాన్ XI పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి  ఆపరేషన్ ముష్కాన్ XI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, కిరాణం షాపులు, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఫ్యాక్టరీ లలో పనిచేస్తున్న బాల కార్మికులను మరియు వదిలివేయబడిన పిల్లలను, రోడ్డుపై  భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి అప్పగించడం లేదా చైల్డ్ కేర్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై నూతన చట్టాలను అనుసరించి క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి గారు హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరి కి గురికాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని భాద్యతగా నిర్వర్తించాలని సూచించారు.    

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సత్యనారాయణ, G. మోహన్, సిఐలు హతిరాం, G.మహేందర్ రెడ్డి ఎస్. బి సీఐ చంద్రమౌళి, CWC ఛైర్పర్సన్ నాగవాణి,  చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ వెంకటేష్, సూపర్వైజర్ కళ్యాణి, DCPU కౌన్సిలర్ రమేష్, షేర్ NGO హిమ బిందు  ఆపరేషన్ ముష్కాన్ XI టీంలు పాల్గొన్నారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >