Posted on 2023-12-14 12:53:21
రిమ్స్ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన
డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధ వారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది.
క్యాంపస్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపి స్తున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తున్నది.
ఈ క్రమంలో ఇంటర్న్షిప్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాగా, క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్తోపాటు క్యాంప స్లోకి వచ్చిన బయటి వ్యక్తులే తమపై దాడికి పాల్పడ్డారని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
కాలేజీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ క్రాంతి దిష్టిబొమ్మను దహనం చేశారు.
వసీం అనే వ్యక్తితో కలిసి మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని చెప్పారు. అయితే మెయిన్ గేట్ సెక్యూరిటీని లెక్క చేయ కుండా దుండగులు క్యాం పస్లోకి వచ్చారని, వారంతా రిమ్స్ డైరెక్టర్ అభిమానులని ఆరోపి స్తున్నారు.
అయితే ఎలాంటి అవాం ఛనీయ పరిస్థితులు తలెత్త కుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రిమ్స్లోకి చొరబడ్డ వ్యక్తు లను పోలీసులు అదు పులోకి తీసుకొని విచారి స్తున్నట్లు సమాచారం...
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >