Posted on 2025-06-24 21:06:17
అదృశ్యమైన బాలుని కుటుంబ సభ్యులకి అప్పగించిన పోలీసులు
చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై తోపాటు కానిస్టేబుల్ లను అభినందించిన సీఐ
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన మొహమ్మద్ తాజుద్దీన్ (8) అనే బాలుడు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ అయినటువంటి బాబయ్య, రషీద్, సాయి విహార్, దినేష్ లను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు తో పాటు, చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం సేకరించి సిద్దిపేటలోని వారి నానమ్మ వద్ద ఉన్నట్లు సమాచారం తెలుసుకొని మంగళవారం మధ్యాహ్నం బాలుడుతోపాటు నానమ్మల ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అట్టి బాలుడిని సిడబ్ల్యుసి అధికారులకు అప్పగించినట్లు సిఐ వెల్లడించారు.
చాకచక్యంగా వ్యవహరించి 24 గంటలలోపే బాలుడి ఆచూకీ గుర్తించి కేసును చేదించినందుకు ఎస్ఐ రమాకాంత్ ను,నాలుగురు కానిస్టేబుల్ లను సిఐ అభినందించారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >