Posted on 2025-06-24 15:21:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు మండల వ్యాప్తంగా సుమారు 250 మంది లబ్ధిదారులకు అందజేసినారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఇందిరామరాజ్యమని మహిళలు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతున్నామని అన్నారు 6గ్యారెంటీ పథకాలను మరోసారి ప్రజలకు వివరించారు ఇందిరమ్మ ఇల్లు రానివాళ్లు బాధపడే పనిలేదని మరికొన్ని మండలానికి తీసుకువస్తానని అన్నారు గోదావరి జిల్లాలను జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు నింపే ప్రయత్నం చేస్తానని రైతులు చిరకాలంగా గుర్తించుకుంటారని అన్నారు ప్రతి మార్కెట్ సమస్య ఉందని శాశ్వత మార్కెట్ గా చేసేంతవరకు బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇచ్చారు కార్యక్రమంలో లేళ్ల వెంకటరెడ్డి , మంగీలా నాయక్, దుద్దుకూరు మధుసూదన్ రావు,రోకటిసురేష్ , రామిశెట్టి రాంబాబు, తాళ్లూరి అచ్చయ్య, బేతాళపాడు మాజీ సర్పంచ్ రాందాస్, పొన్నెకంటి సతీష్ కంచర్ల హరీష్ ఓబీసీ సెల్ నరసింహారావు. వేల్పుల నరసింహారావు దుద్దుకూరి సుమంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >