Posted on 2025-06-21 14:26:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మద్యం సేవించి వాహనం నడుపుతూ ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమని, కోర్టుకు హాజరై జరిమానా చెల్లించాలని పోలీసులు సూచించారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఇరుకు గోపి(25) ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చదువుతుండడంతో పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల మద్యం తాగి బండి నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ నెల 19న పోలీసులు అతనికి ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని సూచించారు.
సమయానికి గోపి రాకపోవడంతో పోలీసులు మరోసారి ఫోన్ చేశారు. కోర్టుకు వచ్చి ఫైన్ కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన గోపి తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తరువాత భార్యను కళాశాల వద్ద దింపి ఇంటికి వచ్చి.. దూలానికి ఉరేసుకుని చనిపోయాడు. కాగా, తన భర్త మరణానికి ట్రాఫిక్ పోలీసులే కారణమని గోపి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >