Posted on 2025-06-08 12:14:39
బడి మనది... బడిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే ...
ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాల,సిరిసిల్ల ఉపాధ్యాయులు ఈరోజు ఇందిరానగర్ ,బివైనగర్లలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యావంతులు, అనుభవజ్ఞులు టీచర్లుగా పనిచేస్తున్నారని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అనేక అవార్డులు అందుకున్నారని, గత రెండేళ్లుగా పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, బాసర త్రిబుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి ఆధునిక సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్ కుమ్మరి మల్లేశం సమ్మయ్య సామాజిక కార్యకర్తలు రామకృష్ణ నవీన్ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >