| Daily భారత్
Logo




ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య...

News

Posted on 2025-06-08 12:14:39

Share: Share


ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య...

బడి మనది... బడిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే ...

ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు...

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాల,సిరిసిల్ల ఉపాధ్యాయులు ఈరోజు ఇందిరానగర్ ,బివైనగర్లలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో  నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యావంతులు, అనుభవజ్ఞులు టీచర్లుగా పనిచేస్తున్నారని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అనేక అవార్డులు అందుకున్నారని, గత రెండేళ్లుగా పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, బాసర త్రిబుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి ఆధునిక సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్ కుమ్మరి మల్లేశం సమ్మయ్య సామాజిక కార్యకర్తలు రామకృష్ణ నవీన్ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >