Posted on 2025-06-08 08:44:39
బడి మనది... బడిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే ...
ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాల,సిరిసిల్ల ఉపాధ్యాయులు ఈరోజు ఇందిరానగర్ ,బివైనగర్లలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యావంతులు, అనుభవజ్ఞులు టీచర్లుగా పనిచేస్తున్నారని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అనేక అవార్డులు అందుకున్నారని, గత రెండేళ్లుగా పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, బాసర త్రిబుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి ఆధునిక సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్ కుమ్మరి మల్లేశం సమ్మయ్య సామాజిక కార్యకర్తలు రామకృష్ణ నవీన్ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >