Posted on 2025-06-07 18:46:30
డైలీ భారత్, రాజస్థాన్:రాజస్థాన్లో ఘోరం జరిగింది. ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఓ మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి బెడ్ చుట్టూ కర్టెన్లు వేసి ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అయినప్పటికీ ఆమెకు కొంత స్పృహ ఉండటంతో కుటుంబ సభ్యులను పిలిచేందుకు ప్రయత్నించింది.
ఆ తరవాత పూర్తిగా మత్తులోకి జారుకోగా అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహ వచ్చిన తరవాత బాధితులు విషయాన్ని కుటుంబ సభ్యలుకు తెలిపింది. దీంతో ఆమె భర్త ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీశాడు. కానీ యాజమాన్యం ఖండించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కమిటీ వేసి విచారిస్తామని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ ఘటనతో ఆస్పత్రిలోని ఇతర పేషంట్స్ కూడా భయపోడిపోతున్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >