Posted on 2025-06-07 18:46:30
డైలీ భారత్, రాజస్థాన్:రాజస్థాన్లో ఘోరం జరిగింది. ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఓ మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి బెడ్ చుట్టూ కర్టెన్లు వేసి ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అయినప్పటికీ ఆమెకు కొంత స్పృహ ఉండటంతో కుటుంబ సభ్యులను పిలిచేందుకు ప్రయత్నించింది.
ఆ తరవాత పూర్తిగా మత్తులోకి జారుకోగా అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహ వచ్చిన తరవాత బాధితులు విషయాన్ని కుటుంబ సభ్యలుకు తెలిపింది. దీంతో ఆమె భర్త ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీశాడు. కానీ యాజమాన్యం ఖండించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కమిటీ వేసి విచారిస్తామని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ ఘటనతో ఆస్పత్రిలోని ఇతర పేషంట్స్ కూడా భయపోడిపోతున్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >