Posted on 2023-12-10 13:40:47
డైలీ భారత్, చత్తీస్ ఘఢ్ : ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్ జిల్లా చోతేదోంగర్ గ్రామ స్థుడ్ని శనివారంసాయంత్రం నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు కోమల్ మంఝ అని పోలీస్లు గుర్తించారు.
చోతేదోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంఝ ఆయన తన మేనమామతో కలిసి ఆలయంలో పూజలు చేసి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది.
వీరిద్దరికీ గతంలో చంపు తామని బెదిరింపులు కూడా వచ్చాయని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. గత నెల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా లోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొంతమందిని నారాయణ్పూర్ జిల్లా కేంద్రానికి తరలించి భద్రత కల్పించారు. వారిలో వీరిద్దరు ఉన్నారు.
రెండవ దశ పోలింగ్ పూర్తి అయిన తరువాత వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చేశారు. తమకు ఇక రక్షణ అక్కరలేదని తిరస్కరించారని పోలీస్ అధికారి తెలిపారు.
మంఝహత్య సంగతి తెలియగానే పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలిం చారు. హత్య జరిగిన చోట మావోయిస్టుల చేతిరాత కాగితం దొరికింది.
మంఝ,అందాయి ఘాటి ఇనుప ఖనిజం గని ఏజెంట్గా పని చేస్తు న్నాడని, భారీగా డబ్బు సంపాదిస్తున్నాడని నోట్లో రాసి ఉంది. మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >