Posted on 2025-04-30 11:12:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపిఎస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న జిల్లా సిసిఎస్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకొని నిందితులను పట్టుకోవడంలో బాధ్యతగా విధులు నిర్వర్తించినందుకు గాను రాష్ట్ర డిజిపి గారు వీరికి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఆంధ్రా-ఒరిస్సా అటవీ ప్రాంతాల నుండి అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసినందులకుగాను రాష్ట్రంలోనే అధికంగా భద్రాది కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నగదు రివార్డులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేసినా,విక్రయించినా,కొనుగోలు చేసినా అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గంజాయి అక్రమ రవాణా గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్బంగా ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్,రామారావు మరియు సిబ్బంది రవి,విజయ్,రామకృష్ణ,భాస్కర్, వెంకటనారాయణలు పాల్గొన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >