Posted on 2023-08-30 04:13:38
ఎల్పీజీ సిలిండర్ ధర ₹200 తగ్గిస్తూ ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటగ్యాస్ సిలిండర్ ధరను ₹200 మేర తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దేశంలోని వినియోగదారులందరికీ- అంటే… 33 కోట్ల మంది ఎల్పిజి వాడకందారులకు ప్రయోజనం కలుగుతుంది.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ- రాఖీ పండుగ శుభ సందర్భంలో ఇది మన కుటుంబాల్లో ఆనందం ఇనుమడింపే చేసు రోజుగా ఆయన అభివర్ణించారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు వారి ఖాతాల్లో ప్రతి సిలిండరుకు ₹200 వంతున సబ్సిడీ జమ అవుతుంది.
ఈ పథకం కింద మరో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి "ఎక్స్" పోస్టులపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:
రక్షాబంధన్ పర్వదినం మనందరి కుటుంబంలో ఆనందాన్ని ఇనుమడింపజేసే రోజు. ఈ సందర్భంగా వంటగ్యాస్ ధర తగ్గింపు మన సోదరీమణులకు సౌకర్యం పెంచి, వారి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మేరకు నా ప్రతి సోదరి సంతోషంగా.. ఆరోగ్యంగా.. సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను, అని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >