Posted on 2024-09-10 17:46:35
షాద్ నగర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ఐలమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
హాజరైన మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దొరల పెత్తనాన్ని ఎదురించి
రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత, దొరల గడిలను గడగడలాడించిన విప్లవ మూర్తి చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ లు కొనియాడారు..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వీరితోపాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ..
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైందనీ, తొలి భూపోరాటానికి నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి సాయుధ పోరాటాన్ని గడగడలాడించారని అన్నారు. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట నేపథ్యం గురించి వారు స్మరించుకుంటూ.. ప్రస్తుత వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ-సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా ఐలమ్మ జన్మించిందనీ, కాగా, 1921లో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఆంధ్రజన సంఘం మారిన పరిస్థితుల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకున్న వేళ 1944లో భువనగిరి మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబల్యంతో భూమి, భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయన్నారు. ఈ మహాసభతో ఉత్తేజం పొందిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసిందనీ, పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి భూములు కౌలుకు తీసుకొని పండించిన పంట పొలాలపై విస్నూరు దేశ్ముఖ్ కిరాయి గూండాలు దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీన పరుచుకున్న క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారనీ కిరాయి రౌడీలను తరిమి కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారన్నారు. ఈ నేపథ్యంలో రజాకార్లు ఐలమ్మ ఇంటిని తగులబెట్టి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆమె కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారనీ
ఈ క్రమంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజం పడగా, పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారనీ ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది అమరులు కాగా, మొత్తంగా 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగిందనీ చివరకు 1985 సెప్టెంబర్ 10న ఐలమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచిందనీ ఆమె సేవలను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కౌన్సిలర్లు కానుగుఅనంతయ్య, బచ్చలి నరసింహ, టిఆర్ఎస్ నాయకులు జూపల్లి శంకర్ పిల్లి శేఖర్, చెరుకు శివ తదితరులు పాల్గొన్నారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >