Posted on 2024-07-25 21:06:30
షాద్ నగర్ లో అంగరంగ వైభవంగా బోనాలు
పటేల్ రోడ్డు 21 వ వార్డులో చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
పోచమ్మ ఆలయం, భాగ్యనగర్ కాలనీ, చటాన్ పల్లి, భగత్ సింగ్ కాలనీ, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే శంకర్ బోనాల పర్యటన.
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో .. బెమ్మాండం బద్దలు గొట్టేయ్ రో.. సీటి గొట్టీ బయలెల్లూ .. చత్రీ బట్టీ బయలెల్లూ దంకా ఇస్తూ దత్తర్లూ .. కమ్మా ఇంచూ డల్లర్లూ అంటూ షాద్ నగర్ పట్టణంలో జోరుగా బోనాల సందడి నెలకొంది.
ఈసారి బోనాలకు ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిలిచారు. బోనాల వేడుకల్లో తనదైన శైలిలో చర్నకోల చేతపట్టి పోతురాజులతో విన్యాసాలు చేయిస్తూ తనదైన శైలిలో నృత్యం చేశారు. ఎమ్మెల్యే శంకర్ బోనాల వేడుకల్లో పోతురాజులు చేస్తున్న విన్యాసాలతో సమానంగా తగ్గేదే లేదు అంటూ వేసిన చిందులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జోర్దార్ గా పట్టణంలో జరిగిన బోనాలకు ఎమ్మెల్యే శంకర్ ఆయన అనుచరులు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పట్టణంలోని 21 వ వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కే చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకకు శంకర్ హాజరై భక్తులతో కలిసి ఆడి పాడారు. అదేవిధంగా పోచమ్మ ఆలయం, భాగ్యనగర్ కాలనీ, చటాన్ పల్లి, భగత్ సింగ్ కాలనీలలో జరిగిన బోనాల వేడుకలకు ఎమ్మెల్యే శంకర్ హాజరై భక్తులకు ఉత్సాహం కల్పించారు.
దుష్టశక్తులను తరిమేద్దాం - ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారని బోనాల కార్యక్రమంతో గ్రామదేవతల చల్లని ఆశీస్సులతో దుష్టశక్తులను తరిమేద్దామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. బోనాల సందడి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అను బంధాలను పెంపొందించే వారధి బోనాలు అని అన్నారు. షాద్ నగర వాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం అని, బోనాలు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించే హిందువుల పండుగని, ఈ పండుగ ప్రధానంగా తెలంగాణలో
జరుపుకుంటున్నామని అన్నారు. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారనీ పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవిలకి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అగ్గనూర్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి, అగ్గనూర్ బస్వo, బాబర్ ఖాన్, శ్రీనివాస్ యాదవ్, జృముద్ ఖాన్, అందే మోహన్,ఇబ్రహీం, శ్రీనివాస్, అశోక్, ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, ప్రవీణ్, శేఖర్, రాహుల్,జగదీశ్వర్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >