Posted on 2024-07-24 17:13:24
200 గ్రాముల గంజాయి,ఒక గంజాయి మొక్క స్వాధీనం.
సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఈ రోజు ఎస్.ఐ సుధాకర్ తో కలసి వివరాలు వెల్లడించిన సి.ఐ మొగిలి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇల్లంతకుంట మండలానికి చెందిన వివేక్, వేణు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి తాగడానికి అలవాటు పడి తంగాళపల్లి గ్రామానికి చెందిన క్రాంతి వద్ద గంజాయి కొనుగోలు చేసి అట్టి గంజాయి తాగుతూ మిగిలిన గంజాయి అమ్మడానికి వివేక్, వేణు ఇద్దరు వ్యక్తులు తంగాళపల్లి మండలంలోని అంబగుడి వద్దకి వస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని వారిని విచారించగా వారు తంగాళపల్లి గ్రామానికి చెందిన క్రాంతి వద్ద వారికి అవసరం ఉన్నప్పుడల్లా కొనుగోలు చేసి తగగా మిగిలిన గంజాయి అమ్ముకుంటున్నాం అని చెప్పగా , తంగాళపల్లి ఎస్.ఐ సుధాకర్ తన సిబ్బందితో నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో క్రాంతి ఇంట్లో తనిఖీ చేపట్టి అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్క స్వాధీనం చేసుకొని ఈ రోజు ముగ్గురు గంజాయి నిందుతులను రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు.
నిందుతుల వివరాలు.
1.జక్కనపల్లి వివేక్ , s/o పోచమళ్ళు,19y, r/o మైలారం గ్రామం ,గన్నేరువరం మండలం, ప్రస్తుతం ముస్కానిపేట,ఇల్లంతకుంట మండలం.
2.అంతటి వేణు, s/o పర్శరాములు,21y, r/o ఇల్లంతకుంట.
3.క్రాంతి, తంగాళపల్లి గ్రామం.
ప్రజలు ఎవరైనా గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించగలరని, యువత డ్రగ్స్ భారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని, 2024 సంవత్సరంలో ఈ రోజు వరకు జిల్లాలో 47 కేసులలో 121 మందిని అదుపులోకి 31.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >