Posted on 2024-07-24 16:27:58
తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ ప్రస్థానం గొప్పది
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు సుపరిచితులు కేటీఆర్ అని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో తనదైన ముద్రను వేసిన యువనేత యువతకు మార్గదర్శకుడు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అభినందించారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆయనను హైదరాబాద్ లో ప్రత్యేకంగా కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పూల బొకేతో ఆయనను గౌరవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
ఒకవైపు పార్టీని నడిపించే బాధ్యత భుజాన వేసుకొని.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో తీసుకొని రావడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడు కేటీఆర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చి అప్పటి నుంచి ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అహర్నిశలు రాష్ట్రం కోసం సేవలు అందించాలని గుర్తు చేశారు. చాలా మంది కేటీఆర్ మంత్రిగా తెలంగాణకు చేసిన సేవను మాత్రం పొగడకుండా ఉండలేరని ఐటీ అంటే కేటీఆర్ అనేలా ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారని గత సేవల జ్ఞాపకాలను ఆయన నెంబర్ వేసుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా కలుసుకొని శుభాకాంక్షలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిదీ విభిన్నశైలని వారి ఆలోచనా ధోరణి కూడా వేర్వేరుగా ఉంటుందని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ ఒకటే లక్ష్యంగా ముందుకు సాగారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం, రాజకీయాల్లో ఎదురులేని పటిష్టత కోసం కేసీఆర్ పని చేశారని రాజకీయ శత్రువులను బలహీన పరుస్తూ.. పార్టీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చారనీ అదే సమయంలో కేటీఆర్ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం, యువత ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం ముందుకు సాగారని టిఆర్ఎస్ పాలన గురించి కొనియాడారు..
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >