Posted on 2024-02-28 22:13:10
డైలీ భారత్, ఖమ్మం : నా పర్యటనల పట్ల ప్రత్యేక ఆంక్షలెందుకు అని మంత్రి తుమ్మల పోలీసులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర పోలీసు అధికారులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా నగరంలో తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించి సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దని, తన కాన్వాయ్ లో ట్రాఫిక్ పోలీస్ వెహికిల్ తప్ప వేరే వాహనాలు అవసరం లేదని, అదే విధంగా వివిధ స్టేషన్ల పరిధి నుండి వచ్చే లైజనింగ్ వాహనాలు కాన్వాయ్ లో అవసరం లేదని అన్నారు. వారు తమ స్టేషన్లలో విధులు నిర్వహించుకావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ రమణ మూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, టూ టౌన్ సీసిఐ బాలకృష్ణ, ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు, ట్రాఫిక్ ఎస్సై రవి కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >