Posted on 2024-02-24 21:46:17
డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు. ధరణి పోర్టల్ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని అధికారులను సీఎం ప్రశ్నించారు.
లక్షలాది రైతుల భూరికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారన్నారు సీఎం. గోప్యంగా ఉండాల్సిన లక్షలాది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని సీఎం ప్రశ్నించారు.
ధరణిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్ది ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోగా అన్ని మండాల కేంద్రాల్లో పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి కమిటీ సూచలను పరిగణలోనికి తీసుకుని విధివిధనాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పగా వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >