Posted on 2026-07-26 16:51:12
కామారెడ్డి జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దుంపటి రాజు
డైలీ భారత్, కామారెడ్డి: ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ పిలుపు మేరకు, ఈ నెల 28వ తేదీ (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దుంపటి రాజు జిల్లా లోని ఉప సర్పంచులందరికీ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల ఉప సర్పంచులు తప్పనిసరిగా హాజరై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయాలని కోరారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఉప సర్పంచుల సమస్యలు, డిమాండ్లను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.
వినతిపత్రంలో ప్రధానంగా ఈ డిమాండ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు: ఉప సర్పంచులకు నెలకు ₹5,000 గౌరవ వేతనం మంజూరు చేయాలి. ప్రభుత్వ అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లను కూడా చేర్చాలి.గ్రామపంచాయతీ తీర్మానాలపై ఉప సర్పంచులు కూడా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలి.మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను తప్పనిసరిగా ఆహ్వానించాల అనే డిమాండ్లతో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.కామారెడ్డి జిల్లాలోని ఉప సర్పంచులందరూ ఐక్యంగా పాల్గొని "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దుంపటి రాజు విజ్ఞప్తి చేశారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >