Posted on 2026-07-22 12:40:48
ప్రచురణార్థం
తేది. 22-07-2026
కార్మికుల మనోవికాస సదస్సులో సైకాలజిస్ట్ పున్నంచందర్ పిలుపు
డైలీ భారత్, సిరిసిల్ల: కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల గణేష్ నగర్లో కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ.. కార్మికులు కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి కారణంగా తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపడం లేదన్నారు.
ప్రస్తుతం అనేక మంది కార్మికులు జీవనశైలి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు.
శారీరకంగా కష్టపడి పనిచేసే కార్మికులు కూడా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
కార్మికులు క్రమం తప్పకుండా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఉప్పు మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పొగాకు, గుట్కా, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు.
అలాగే ప్రతిరోజూ తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడంతో పాటు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, శ్వాసాభ్యాసాలు, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుపుతూ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారు తమ కుటుంబాలను సంతోషంగా చూసుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు పున్నంచందర్ అన్నారు.
మానసిక సమస్యలు ఎదురైనప్పుడు మనోవికాస కేంద్రాన్ని సంప్రదించి సరైన చికిత్స, కౌన్సెలింగ్ పొందాలని కార్మికులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది, బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత మరియు కార్మికులు పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >