| Daily భారత్
Logo




సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

News

Posted on 2026-07-21 06:12:30

Share: Share


సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్‌దుంగ్-మామరింగ్ టన్నెల్ బయట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు 27 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు.

వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించింది. మృతదేహాలను సింగ్తం జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్‌టాక్‌లోని STNM ఆసుపత్రి, నామ్‌చి జిల్లా ఆసుపత్రులకు తరలించారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులకు అతిపెద్ద సవాలు.. టన్నెల్ లోపల నిండిపోయిన ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ ఉండటమని అధికారులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడటంతో భూమి, రాళ్ల పొరలు జరిగి ఈ గ్యాస్ బయటకు విడుదలైనట్లు భావిస్తున్నారు. గ్యాస్ ప్రభావం వల్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్న పలువురు రెస్క్యూ సిబ్బందికి తల తిరగడం, మరికొందరు స్పృహ తప్పిపడిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు టన్నెల్ మార్గం చాలా ఇరుకుగా ఉండటం, పొగ లేదా మబ్బు వల్ల దారి సరిగ్గా కనిపించకపోవడం కూడా రెస్క్యూ టీమ్‌కు తీవ్ర అడ్డంకిగా మారాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం నామ్‌చి జిల్లా యంత్రాంగం ఎన్ హెచ్ పి సి (NHPC) అధికారులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF), ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), సిక్కిం పోలీసులు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆరోగ్య శాఖలతో కలిసి నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అలాగే సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SSDMA) అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. కొండచరియలు విరిగిపడి టన్నెల్ ప్రవేశ మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోవడంతో, లోపల ఉన్న కార్మికులను సురక్షితంగా కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.

Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >