Posted on 2026-04-06 08:25:21
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం స్థానిక గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లీలా కృష్ణ డాక్టర్ మురళీకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
అనంతరం వక్తలు మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్థానికంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తూ పూర్తిస్థాయి మౌలిక వసతులతో నూతన ఆవిష్కరణలతో విద్యాసంస్థ నిర్వహిస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీ పరీక్షలలో స్థానిక విద్యార్థులు ప్రపంచీకరణలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టామని ప్రధానోపాధ్యాయులు చిలుక వేణు కిరణ్ తెలిపారు.
ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >