| Daily భారత్
Logo




ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

News

Posted on 2026-04-04 15:46:15

Share: Share


ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో కలిసి ఆసుపత్రుల పనితీరు, అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ సేవలపై సమగ్రంగా సమీక్షించారు.

ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి, ఆసుపత్రుల్లో కొనసాగుతున్న నిర్మాణాలు, మరమ్మత్తుల పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి ఆసుపత్రి పరిస్థితిపై సూపరింటెండెంట్ల నుండి వివరాలు తెలుసుకుని, సిబ్బంది కొరత, వైద్యుల లభ్యత వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్ల మరమ్మత్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించి, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసవ సేవలపై సమీక్ష నిర్వహించి అవసరమైన మెరుగుదలలు చేపట్టాలని తెలిపారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రత కోసం తగిన శానిటేషన్ సిబ్బంది ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్త నిల్వలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, సికిల్ సెల్ అనీమియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.


ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

#BhadradriKothagudem #Healthcare #Aarogyasri #Telangana

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >