Posted on 2026-02-20 18:14:45
రిబ్బన్ కట్ చేసి అంగడిని వైభవంగా ప్రారంభించిన ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్
భారీగా హాజరైన గ్రామ ప్రజలు,పెద్దలు,పలు రకాల వ్యాపారస్తులు.
అంగడితో కొత్త ధనాన్ని సంతరించుకున్న ఖానాపురం గ్రామ వీధులు..
కూరగాయల సంతకు కేవలం 10 రూపాయలు, పశువులకు 35 రూపాయలు మాత్రమే.
వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం
గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామానికి ఆర్థిక వనరులు సమకూర్చడమే లక్ష్యం..
ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సర్పంచ్ దాసరి రమేష్...
డైలీ భారత్, నర్సంపేట /ఖానాపురం :గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, గ్రామానికి ఆర్థిక వనరులు సమకూర్చాలని సంకల్పంతో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అంగడిని శుక్రవారం సర్పంచ్ దాసరి రమేష్ పాలకవర్గం గ్రామ ప్రజల సమక్షంలో రిబ్బన్ కత్తిరించి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
గ్రామ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేడు అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ఖానాపురం మండల కేంద్రంగా నిర్వహించే వారపు సంతలో కూరగాయలు చిరు వ్యాపారులకు కేవలం 10 రూపాయలు, పశువులకు 30 రూపాయలు (అంగడి చిట్టి)రహదారితో అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ అంగడిని ఖానాపురం పరిసర ప్రాంత ప్రజలు, నర్సంపేట నియోజకవర్గం ప్రజలు వ్యాపారులు చిరు వ్యాపారులు,బేరం చేసే వ్యక్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అంగడి నిర్వహణ మొత్తం ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు చూసుకుంటారని తెలిపారు.
ఖానాపురం చుట్టుప్రక్కల పల్లెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపారం సమృద్ధిగా నడుస్తుందని దీనిని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఉప్పు రాజు నిర్వాణ కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట ప్రసాద్ రావు, గుండ్లపల్లి విజయ్, చలికంటి మల్లికార్జున్ సభ్యులు కందుల రమాదేవి కామిశెట్టి లక్ష్మి శాఖమూరి ముఖేష్ చౌదరి భూక్య స్రవంతి ఈలపొంగు కొమరమ్మ తోటకూరి సంధ్య గుండ్లపల్లి మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మాజీ సర్పంచులు పరుచూరి సుబ్బారావు తక్కలపల్లి రమేష్ మాజీ ఎంపీటీసీలు బోడ పూలు నాయక్, మాజీ ఉపసర్పంచ్ మేడిద కుమార్ పెద్ద ఎత్తున గ్రామస్తులు, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >