Posted on 2026-02-04 12:39:55
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఎన్నికల ఖర్చులపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఎన్నికల ఖర్చుల అవగాహన కార్యక్రమం సి నా రే కళా మందిరం లో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమావళి, ఖర్చుల పరిమితి, ఖర్చుల వివరాల నమోదు విధానం, డే టు డే అకౌంట్ నిర్వహణ, షాడో రిజిస్టర్ నిర్వహణ, బ్యాంక్ అకౌంట్ వినియోగం వంటి అంశాలపై అభ్యర్థులకు వివరంగా అవగాహన కల్పించారు.
అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ, భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అనుమతి లేని ఖర్చులు చేయరాదని, చేసిన ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు తప్పనిసరిగా భద్రపరచాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అభ్యర్థుల్లో ఎన్నికల ఖర్చులపై స్పష్టత ఏర్పడి, స్వచ్ఛమైన, న్యాయమైన మరియు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ , రిటర్నింగ్ ఆఫీసర్లు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >